• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

SRSP కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య

JGL: జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

February 24, 2026 / 11:52 AM IST

పద్మనాభ రెడ్డి.. కాపుల జోలికి రావొద్దు: ఎంపీ సానా

KKD: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని వినియోగించుకోవద్దన్నారు.

February 24, 2026 / 11:52 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ డ్రైవ్

SKL: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జె.కె.సీ, B.B.Q Nation ఆధ్వర్యంలో నేడు ట్రైనింగ్ కమ్–జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ తెలిపారు. ఎస్‌.ఎస్‌.సీ ఉత్తీర్ణులై 18 నుంచి 28 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్ వి.ల్యూక్ పాల్‌ను సంప్రదించాలన్నారు.

February 24, 2026 / 11:52 AM IST

రజక కుటుంబంపై దాడి.. ఖండించిన మంత్రి

TG: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులాలు మతాలు ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందేనన్నారు. ఈ దాడిలో చిన్నపాప మృతి బాధాకరమన్నారు. పాప మృతికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

February 24, 2026 / 11:51 AM IST

మంత్రాలయం అభివృద్ధిపై కీలక సమీక్ష

KRNL: జిల్లా అభివృద్ధిపై మంత్రులు రామానాయుడు, TG భరత్ సమక్షంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రాలయం TDP ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదిక సమర్పించారు. ఈ నెల 26న CM చంద్రబాబుతో జరిగే సమావేశానికి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

February 24, 2026 / 11:48 AM IST

‘నిరంతరం కార్పొరషన్ అభివృద్ధికి కృషి చేశా’

నెల్లూరు కార్పొరేషన్ ఇంఛార్జ్ మేయర్‌గా గడిచిన 70 రోజుల్లో తాను ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టానని రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిరంతరం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేశానన్నారు. సహకరించిన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 11:47 AM IST

బేతంచెర్లలో ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ

NDL: బేతంచెర్ల మండలం గోరుమానకొండ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్సై తిరుపాలు మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.

February 24, 2026 / 11:47 AM IST

‘విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’

BHNG: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీతానగరం గ్రామ ఉప సర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య సూచించారు. మంగళవారం మునగాల మండలం సీతానగరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆయన సొంత ఖర్చుతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు.

February 24, 2026 / 11:46 AM IST

ఉండేశ్వరపురంలో CMRF చెక్కులు పంపిణీ

E.G: సీతానగరం మండలం ఉండేశ్వరపురంలో MLA బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి మంగళవారం లబ్ధిదారులు అందజేశారు. గ్రామానికి చెందిన టి.లక్ష్మీ భవానికి రూ.20675, ఎల్.పెద్దకాపుకి రూ.42,465, ఎన్.విజయలక్ష్మికి రూ.24,792, ఎన్. సూర్యనారాయణకి రూ.51,014 మంజూరు చేశారు.

February 24, 2026 / 11:45 AM IST

న్యూ బోయగూడలో చెత్త డంపింగ్ పాయింట్ మూసివేత

HYD: బన్సీలాల్‌పేట్ డివిజన్ న్యూ బోయగూడలో సాయి మెడికల్ హాల్ ఎదుట ఉన్న ఓపెన్ చెత్త డంపింగ్ పాయింట్‌ను స్థానికులు, నాయకులు కలిసి ఇవాళ మూసివేశారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య మెరుగుదల, ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ఐత చిరంజీవి, సాయి సందీప్, సంజయ్, రవీందర్, గజానంద పాల్గొన్నారు.

February 24, 2026 / 11:45 AM IST

ధనలక్ష్మిపురంలో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక వావిలేటిపాడు, ధనలక్ష్మిపురం ప్రాంతాలలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ల పరిధిలోని వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. భవనాలకు కొలతలు వేసి సరిపోల్చారు.

February 24, 2026 / 11:44 AM IST

గుంటూరు ఛానల్ కట్టలకు నిధులు: మంత్రి నిమ్మల

AP: గుంటూరు ఛానల్ కట్టలు దెబ్బతిన్నాయని మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. రూ.369 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఛానల్ పొడిగింపునకు ప్రభుత్వం రూ.285 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేజ్-1 కింద అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

February 24, 2026 / 11:43 AM IST

‘కార్తికేయ 2’ సెట్‌లో చేదు అనుభవం: అనుపమ

‘కార్తికేయ-2’ షూటింగ్‌లో జరిగిన ఒక విషాదకర ఘటనను నటి అనుపమ పరమేశ్వరన్  గుర్తు చేసుకుంది. సెట్‌లో తాను ఎంతో ఇష్టంగా ఆడుకున్న మేకపిల్లనే, యూనిట్ సభ్యులు మటన్ బిర్యానీగా వడ్డించారని తెలిపింది. ఆ విషయం తెలియగానే అక్కడికక్కడే వాంతులు చేసుకున్నానని, అప్పటి నుంచి మటన్ తినడం మానేశానని  ఆవేదన వ్యక్తం చేసింది.

February 24, 2026 / 11:43 AM IST

‘బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని UBI మేనేజర్ శివ బాలు తెలిపారు. మంగళవారం నంది మేడారంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CFL కౌన్సిలర్స్ సుజాత, జ్యోతి పాల్గొన్నారు.

February 24, 2026 / 11:42 AM IST

కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్

RR: మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కేబుల్ బ్రిడ్జి నుంచి ఐటీసీ కోహినూర్‌కు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

February 24, 2026 / 11:41 AM IST