• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పారిశ్రామిక, సాంకేతిక దిశగా అడుగులు..!

కడప: జిల్లా యువతకు నైపుణ్య వేదికగా నిలవనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల వేగం, నాణ్యతపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు.

February 24, 2026 / 03:31 PM IST

కార్యకర్తలపై దాడిని ఖండించిన మక్బూల్

సత్యసాయి: కదిరి మండలం యాకలచెరువుపల్లిలో YCP కార్యకర్తలపై జరిగిన దాడిని నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:31 PM IST

ఫేస్‌బుక్ పోస్టులు.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

AP: అనంతపురంలో ఫేస్‌బుక్ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్ భార్య ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్ అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. వీటిని భర్త చూడడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యతో భర్త ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

February 24, 2026 / 03:31 PM IST

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: మాజీ ఎమ్మెల్యే

KMR: బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం పిట్లంలో ఆయన మాట్లాడూతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA లక్ష్మీకాంతరావు కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయన్నారు.

February 24, 2026 / 03:30 PM IST

వేరుశనగ పంటల పరిశీలన

SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్‌వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.

February 24, 2026 / 03:30 PM IST

ప్రభుత్వ అసమర్థత వల్లే డయేరియా విజృంభణ

SKLM: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి 18 మంది ప్రజలు ఆసుపత్రి పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనులతో తాగునీరు కలుషితమవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

February 24, 2026 / 03:30 PM IST

కల్తీ పాలు ఘటనపై స్పెషలిస్ట్ రవిరాజు ఆరా.!

E.G: రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరైన ప్రోటోకాల్‌తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.

February 24, 2026 / 03:30 PM IST

పింఛన్‌పై విస్తుపోయే వాస్తవాలను వెల్లడించిన సోమిరెడ్డి

NLR: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 03:30 PM IST

భార్యని గొడ్డలితో నరికిన భర్త

RR: ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోని నోముల గ్రామంలో భార్యని భర్త హత మార్చాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నోములకి చెందిన మధర్మోని బాబు తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 03:29 PM IST

తాగునీటి సమస్య.. ఇబ్బంది పడుతున్న ప్రజలు..!

NDL: కొలిమిగుండ్ల పట్టణంలో ఇవాళ తాగునీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కాలనీ, శాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీలలో పైపులు లీకేజీ కావడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ సర్పంచ్ శివ రాముడు వెంటనే లీకేజీ ఉన్న ప్రదేశంలో పైపులను మరమ్మతులు చేస్తున్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

February 24, 2026 / 03:27 PM IST

ఎంవీ కృష్ణారావుకు రేషన్ డీలర్లు నివాళ్ళు

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవనిగడ్డ వంతెన సెంటరులో ఆయన విగ్రహానికి మంగళవారం మండల రేషన్ డీలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

February 24, 2026 / 03:27 PM IST

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి

SRPT: చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన పనస గోవింద్, రెండు రోజుల క్రితం హుజూర్నగర్ వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్లో కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోయిన ఆయన ఇవాళ మేళ్లచెరువు మండలం జోగుకుంట వద్ద గోవింద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 03:26 PM IST

చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కాలు!

చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్‌లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే, ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని దుమ్ము, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

February 24, 2026 / 03:26 PM IST

‘పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?’

KMM: ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ తీవ్రంగా ఖండిచారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్బాలు పలికే కాంగ్రెస్ నేతలు పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

February 24, 2026 / 03:25 PM IST

ఇంటర్ పరీక్షలు రాయనున్న 12,653 మంది విద్యార్థులు

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్‌కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

February 24, 2026 / 03:24 PM IST