NLG: కనగల్ మండల దర్వేశిపురం శ్రీ యల్లమ్మ అమ్మవారి సన్నిధిలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సరస్వతి పూజ నిర్వహించారు. శ్రీ సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న చిన్నారులకు ఆమూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయం తరపున పలకలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చిదేటి వెంకట రెడ్డి, డైరెక్టర్లు, ఈవో అంబటి నాగిరెడ్డి పాల్గొన్నారు.