MBNR: పత్తి రైతులు పత్తిని ఆరబెట్టుకుని నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం మిడ్జిల్ మండలం రాణి పేటలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్తి ఓవర్ లోడ్ లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.