తమిళనాడులో తొక్కిసలాట ఘటన సమయంలో పవర్ కట్ వివాదాస్పదంగా మారింది. తమ నాయకుడు విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ కోరిందని తమిళనాడు విద్యుత్ బోర్డు తెలిపింది. ఈ మేరకు టీవీకే నాయకులు లేఖ ఇచ్చారని చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధృవీకరించారు. అయితే, కావాలనే పవర్ కట్ చేశారని టీవీకే ఆరోపిస్తోంది.