NLR: జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు కలెక్టర్ హిమాన్స్ శుక్లా ఆదేశానుసారం వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఎకరం వరిసాగుకు 135 కేజీలు(మూడు బస్తాలు) చొప్పున అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి రైతుకు ప్రత్యేక కార్డు ఇవ్వనున్నారు. ఒకేసారి కాకుండా 10 రోజుల వ్యవధిలో మూడు విడతలుగా ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.