SRD: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల అధికారులు సమాయత్తం కావాలని ఎంపీడీవో సత్తయ్య సూచించారు. సోమవారం కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో మాట్లాడారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ఆచరణలో పెట్టీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రహీమోద్దిన్, శిక్షకులు కిఫాయత్ అలీ, సంగ్శెట్టి ఉన్నారు.