• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే కాలవ

ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాయదుర్గం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 09:14 AM IST

పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత

JGL: బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతలు జాతీయ నాయకుల చిత్రపటాలు, పోడియం, అలారం క్లాక్‌లను గురువారం బహూకరించారు. మండల విద్యాధికారి సిరుప నాగభూషణం దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జూపాక సుదర్శన్, దాతలు గంధం రమేశ్, చెట్పెల్లి శ్రీధర్, ఏఏపీసీ ఛైర్మన్ సముద్రాల శ్రీలత, మాజీ సర్పంచ్ కోటపల్లి గంగాధర్ పాల్గొన్నారు

February 20, 2026 / 09:13 AM IST

ఈ నెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ

TPT: వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ తులసి జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31వ తేదీ వరకు అర్జీలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు, 27 ఫలితాలు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

February 20, 2026 / 09:12 AM IST

ఆత్మకూరులో ఈనెల 26న మెగా జాబ్ మేళా

NDL: ఈ నెల 26న ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,250 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–30 ఏళ్ల వయసు గల యువత అర్హులన్నారు. సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 09:10 AM IST

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడో రోజు సమావేశాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఇవాళ్టి సెషన్స్‌లో మండలి సభ్యులకు బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు. కాగా ఇందాపూర్ డెయిరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

February 20, 2026 / 09:06 AM IST

నేడు నిజామాబాద్‌కు కోమటి రెడ్డి, PCC చీఫ్

TG: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాల్వంచలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

February 20, 2026 / 09:06 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

NLR: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 09:04 AM IST

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

RR: తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో నిన్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చదువు బోధించారు. పలువురు విద్యార్థులు ఒక్కరోజు హెడ్ మాస్టర్, కలెక్టర్ వంటి హోదాల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి తీపి జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 09:04 AM IST

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్‌ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

February 20, 2026 / 09:03 AM IST

నేడు హుండీ ఆదాయం లెక్కింపు

SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కె.ఏడు కొండలు గురువారం ప్రకటనలో తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవ దాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 09:02 AM IST

నేడు సామాజిక న్యాయ దినోత్సవం

GNTR: నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాలాద్రి తెలిపారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైందని, అసమానతలు పెరిగాయని విమర్శించారు.

February 20, 2026 / 09:01 AM IST

పెద్ద జట్లకు నెదర్లాండ్స్ విజ్ఞప్తి

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పెద్ద జట్లకు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ తరఫున డచ్ ప్లేయర్ బాస్ డెలీడ్ కీలక విజ్ఞప్తి చేశాడు. పెద్ద టీమ్స్ ICC టోర్నీల్లో మినహా తమ నెదర్లాండ్స్ లాంటి అసోసియేట్ జట్లతో ఆడట్లేదని.. ద్వైపాక్షిక సిరీసులు కుదరకుంటే వార్మప్ మ్యాచులైనా ఆడాలని కోరాడు. దీంతో తమ ఆట మెరుగవుతుందని, జూన్‌లో వన్డే WC క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగే వరకు తాము ఖాళీనే అని పేర్కొన్నాడు.

February 20, 2026 / 08:59 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NDL: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 08:56 AM IST

నాగసమందర్‌లో సీసీ కెమెరాల నిఘా

VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్‌లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.

February 20, 2026 / 08:56 AM IST

OTTలోకి వచ్చేసిన ‘ఈషా’

హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ OTTలోకి వచ్చేసింది. గత ఏడాది DEC 25న విడుదలై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం ఓవర్సీస్‌లో రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషించారు.

February 20, 2026 / 08:55 AM IST