NLG: చింతపల్లిలో శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని అన్నారు. ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాక్షించారు.
NZB: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉపాధి హామీ పథకం (2025-26) వార్షిక ప్రణాళికలో భాగంగా శ్రీరాంపూర్, నాగపూర్, దేవాక్కపేట్ గ్రామాల్లో పలు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.
SRCL వేములవాడ లో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అమరులకు సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత కడారి రాములు మాట్లాడుతూ.. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నిజాం నిరంకుశ పాలన వల్ల ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి సీపీఐ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినొద్దీన్, రావి నారాయణరెడ్డి పిలుపుతో ప్రజలు పోరాటంలో చేరారన్నారు
నెల్లూరు: బుచ్చి పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో మొత్తం 151 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు ఆమె పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట పరీక్ష కేంద్రం సిబ్బంది ఉన్నారు.
వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. తొలిరోజు పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 7,208 మంది విద్యార్థులు హాజరు కాగా, 14 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగాయని ఆయన వెల్లడించారు.
BHPL: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
SRCL: కవి, రచయిత పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన “సాహితీ కళా సేవా పురస్కారం2026” కు ఎంపికయ్యారు. తెలుగు భాషతో పాటు సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో అన్ని భారతీయ భాషల్లో ఆయన చేస్తున్న అసాధారణ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న కిషోర్ తెలిపారు.
TG: చాలామంది దేవుడి ముందు అగర్బత్తీలు వెలిగిస్తుంటారు. అయితే కొంతమంది ఇన్నే అగర్బత్తీలు వెలిగించాలని లెక్క చెబుతుంటారు. కానీ అసలు దేవుడికి వెలిగించే అగర్ బత్తీలకు లెక్కేలేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంట్లో దుష్ప్రభవాలు ఉన్నట్లు అనుమానంగా అనిపిస్తే.. సాయంత్రం ఆరు గంటలకు సాంబ్రాణీ కడ్డీలు, గుగ్గిలం లాంటి వాటితో పొగ వేయడం మంచిదంటున్నారు.
ప్రకాశం: అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్వామి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. గ్యాస్ కోసం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.
JN: జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సాదం రమేష్, అధ్యక్షుడిగా దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఆవుల ప్రభాకర్, స్వరూపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
CTR: పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సెజ్ సీఐ సురేష్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఈఎస్ కృష్ణ కిషోర్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ మధ్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తున్నామన్నారు. తగిన ధరావత్తు చెల్లించి, వాహనాల వేలం పాటలో పాల్గొనవచ్చు అన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజ్, గ్రామ సర్పంచ్ సునీల్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదలపై నయా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.
BHNG: మోత్కూర్లో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని తెలిపారు.