KDP: పులివెందుల నుంచి ముద్దనూరు వెళ్లే రహదారిపై మడూరు సమీపంలో బుధవారం బైక్ ప్రమాదం జరిగింది. ముద్దనూరు నుంచి వస్తున్న ఆటో,పులివెందుల నుంచి గ్రామానికి వెళ్తున్న బైకు ఢీ కొట్టింది. గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రామచంద్రుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
KRNL: ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకాన్ని టీడీపీ యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ఈ పథకం ద్వారా 11.16 లక్షల మందికి ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సహాయకులకు 50% టికెట్ రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది.
NDL: రంజాన్ సందర్భంగా డోన్ ఐద్వా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు షేమిమ్ బేగం మాట్లాడుతూ రంజాన్ పండుగ సేవాభావానికి ప్రతీక అని, పేదలతో ఈ ఆనందం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.
కరీంనగర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ‘స్టాటిక్ ఫోర్స్’తో భద్రత కల్పించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.
SRPT: రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పంటల బీమా అమలు చేయాలని, యూరియా యాప్ ఇబ్బందులను తొలగించాలని నేతలు కోరారు. మొంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
సిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన పదవ పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో 7308 మందికి గాను 7297 మంది హాజరయ్యారన్నారు. మొత్తం జిల్లాలో హాజరు 99.85 శాతంగా నమోదు అయిందన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అమ్మవారి దేవాలయాల్లో ఉగాది ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న, కమిషనర్ సతీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టణంలో ఉగాది అతిపెద్ద పండుగ అని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ జరుపుకోవాలని కోరారు.
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధి కనజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు గోత్రనామాలతో ఆలయ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
NRML: బాసర IIITలో విద్యార్థులను పోలీసులు దూషించారనే వార్తలను జిల్లా పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యార్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలు సృష్టించారని పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది.
MDK: జిల్లా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలన్నారు.
WNP: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ ప్రణాళికలో భాగంగా మార్చి 31లోపు 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీమా చేయించే బాధ్యతను బ్యాంకర్లు తీసుకోవాలని ఆదేశించారు.
E.G: గోపాలపురం వైసీపీ కార్యాలయం వద్ద మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో డివిజన్ ఇంఛార్జ్, మండల అధ్యక్షులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వైసీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
SRD: కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకులకు సర్పంచ్ సౌజన్య మణిక్ రెడ్డి క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుధీర్, ఉప సర్పంచ్ గోవిందరావు పాటిల్, నాగభూషణం, మోహన్, గంగారం, అఖిల్, గంగాధర్ ఉమాకాంత్ ఉన్నారు.
BHPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా BHPL జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు.
E.G: ఉగాది పండుగ తెలుగు వారి సాంప్రదాయం అని MPPS విద్యా సంస్థ కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు పేర్కొన్నారు. మండపేట పబ్లిక్ స్కూల్లో బుధవారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పండుగలు సాంప్రదాయ బద్దంగా ఎంపీఎస్లో నిర్వహిస్తున్నామని చెప్పారు.