HYD: SLBC సొరంగం ప్రమాదం జరిగి ఏడాదికావస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా శ్రేయస్సుపై శ్రద్ధపెడితే ఇలాంటి విషాదాలు జరగవని ట్వీట్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలోకానీ సొరంగం పనుల్లోగాని ఎటువంటి పురోగతి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు.