ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విధానంలో టీఆర్ఎస్ కీ, బీజేపీకి చాలా తేడా ఉందని… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ శిక్షణా శిబిరాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ కిషన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
ఇప్పటిదాకా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలగొట్టింది బీజేపీ, ప్రభుత్వాలు ఎలా కూల కొట్టాలి అని మూడు రోజుల శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ఎలా తిట్టాలో ఈ శిక్షణా శిబిరాల్లో నేర్పుతున్నట్టుందని, అభివృద్ధి గురించి చెప్పి ఓట్లడిగే పరిస్థితి బీజేపీకి లేదని అన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో టీఆర్ఎస్ కు బీజేపీకి తేడా ఉందని, బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది ప్రభుత్వాలు కూల గొట్టడానికి కానీ ఇక్కడ మేము రాజ్యాంగం 10 వ షెడ్యూల్ ప్రకారం టీ ఆర్ ఎస్ శాసనసభా పక్షంలో విలీనమయ్యామని అన్నారు.
మేము టీఆర్ఎస్ లో చేరడం వల్లే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ లేదని అన్నారు. ఇక హిందువులకు బీజేపీ మాత్రమే ప్రతినిధి కాదన్న ఆయన మేము హైందవ సంప్రదాయాలు పాటించడం లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో బీజేపీకి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుందని, తమ పాత్ర లేదని అంటున్న బీజేపీ నేతలు కోర్టు గడప ఎందుకు తొక్కుతున్నారని అన్నారు.
స్వామీజీ ల పేరు తో టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని, అలా బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడిందని అన్నారు. మాణిక్యం ఠాగూర్ సమన్ల కు చట్టపరంగా బదులిస్తానన్న సుధీర్ రెడ్డి కొన్ని పార్టీ లు కాలానుగుణంగా అదృశ్యమవుతాయి.. అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటని అన్నారు. కాంగ్రెస్ నడిపించే సమర్ధ నేత ఎవ్వరూ లేరని అన్నారు.