కేరళ సీఎం పినరయి విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శితోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్కు ఈ నోటీసులు అందాయి. 2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.