TG: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాలు ఉండగా, ఇందులో కొంతభాగం గతంలో విద్యుత్ సబ్స్టేషన్, GHMC చెత్త డంపు కోసం ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన భూమి కబ్జా అవుతోందని వచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆ భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ వేశారు.