వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇవాళ కడప సైబర్ క్రైమ్ పీఎస్లో విచారణకు హాజరుకానున్నారు. రాఘవరెడ్డి ఇంటికెళ్లి విచారణకు రావాలని పులివెందుల పోలీసులు తెలియజేశారు. విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో రాఘవరెడ్డి ఇంటి వద్దే పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా.. వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల అంశంలో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.