AP: పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. మార్గదర్శి- బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.