AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సముద్రంలో ఉన్నవారు ఎల్లుండిలోగా తీరానికి తిరిగిరావాలని సూచించారు.