పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 23ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉభయసభలు నివాళులు అర్పించాయి. అనంతరం లోక్సభ స్పీకర్ జీరో అవర్ను ప్రారంభించారు. తర్వాత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు.