రాజ్యసభలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని, విభజన తర్వాత రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.