కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 2,93,437 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 694 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్నదాన ట్రస్ట్ ద్వారా 3510 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించారు.