TG: మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం నడుస్తోందన్న రేవంత్.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్నారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు.