TG: సీఎం రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్లారు. ప్రత్యేక విమానంలో కుటుంబంతో సహా తిరుపతి చేరుకున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే, నిన్న అర్ధరాత్రి నుంచే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభం అయ్యాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.