ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా పలు పాఠశాలలకు ఆగంతకులు ఈ-మెయిల్స్ పంపించారు. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.