జియో తమ ICR సేవలు మెరుగుపరచడానికి BSNLతో చేతులు కలిపింది. గ్రామీణ కవరేజీని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అందుకోసం జియో 28 రోజుల వ్యాలిడిటీతో రూ.196, రూ.396 విలువైన రీఛార్జ్ ప్లాన్స్ను తెచ్చింది. ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మారుమూల ప్రాంతాల్లో కూడా BSNL నెట్వర్క్ను వాడుకోవచ్చు.