ప్రకాశం: కంభం పట్టణంలోని పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో వీరభద్రాచారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.