AP: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై గత నెల 15న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో MS No.30ని విడుదల చేశారు. ఆ మార్గదర్శకాల్లో ఇవాళ్టితో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. మరో 7 రోజులు బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.