అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు భారత్ను తీవ్రంగా ప్రభావితం చేశాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఈ కారణంగా సూరత్లో 1.35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. సముద్రపు ఆహారం, తయారీ రంగాలపైనా ప్రభావం పడిందని పేర్కొన్నారు. సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచాల్సిన అవసరం ఉందని థరూర్ పేర్కొన్నారు.