AP: ధర్నా చేసిన ఉద్యోగులపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని హోంమంత్రి అనిత తెలిపారు. రాజధాని రైతులపై కూడా కేసులు నమోదు చేసిందని విమర్శించారు. విచారణలో 11 కేసులు, పెండింగ్ 39, ముగింపు దశలో 170 కేసులు ఉన్నాయన్నారు. తప్పుడు కేసులు అని తేలితే వెంటనే కేసులు కొట్టివేస్తున్నామని చెప్పారు. కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.