సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసింది. 16 రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక స్టాపేజీ కల్పించింది. దీంతో జనవరి 7 నుంచి 20 వరకు ఈ రైళ్లను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనే ఎక్కొచ్చు. ఈ మేరకు అధికారులు చార్ట్ విడుదల చేశారు.