ATP: ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మధ్య పగటి పూట కొత్త రైలు (57407/08) రాబోతున్నట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. పార్లమెంట్లో ఆమె చేసిన విన్నపానికి స్పందించిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ రైలు సౌకర్యాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.