AP: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. ఈహెచ్ఎస్ (EHS) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్డుల వినియోగం, వైద్య సేవల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి ఏడుగురు సభ్యులతో ‘హైలెవల్ కమిటీ’ని నియమించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల వైద్య కష్టాలకు చెక్ పడనుంది.