TG: సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. భూపాలపల్లిలో ధర్నా నిర్వహించిన కార్మికులు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.51,000 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.