నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృతదేహాలకు ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి పోస్ట్మార్టం మొదలు పెట్టి పూర్తి చేశారు. ప్రత్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్మార్టం జరిగింది. ఇప్పటికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్యశాలకు చేరుకొని...
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించి… అస్వత్తకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని మోదీ కూడా వెళ్లారు. కాగా… ఈ విషయం తెలియగానే… రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా… మోదీ తల్లిగారు కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లి, కొడుకు మధ్య ప్రేమ, ఆప్యాయతలు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఆయన ట్వీట్ చే...
రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర ఢిల్లీలో సాగుతుంది. కాగా… ఈ యాత్రలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడగా… ఆయన పెళ్లి ప్రస్తావన రావడం గమనార్హం. తన పెళ్లి ప్రస్తావన రాగా… దానికి ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడం గమనార్హం. తనకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టమో స్వయంగా ఆయన వివరించడం గమనార్హం. తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలు ఉన్న అమ్మాయిలం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్ట...
డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణీకులకు కోవిడ్ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకు వస్తోంది. కరోనా వైరస్ BF7 చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వేరియంట్ కాదని, నాలుగు వైరస్ వేరియంట్స్ కారణంగా చైనా కరోనాతో అతలాకుతలమవుతోందని వెల్లడైంది. చైనా అధికారిక డేటా ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 5231 కేసులు వెలుగు చూశా...
ఫుట్ బాల్ లెజెండరీ ప్లేయర్ మెస్సీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మెస్సీని విపరీతంగా అభిమానిస్తాడు. ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా మెస్సీ అభిమానిగా మారింది. చిన్న వయసులోనే తండ్రిలాడే ఫుట్బాల్ క్రీడను బాగా ఎంజాయ్ చేస్తోంద...
సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ విస్తారక్ సమావేశం బీహార్లో జరిగింది. ముఖ్యమంత్రి, జనతా దళ్ అధినేత నితీష్ కుమార్పై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. యాంటీ బీజేపీ ఫోర్స్కు నితీష్ కీలక నేతగా ఉండటంతో టార్గెట్ చేసింది. ఇప్పుడు మళ్లీ నెల రోజుల తర్వాత పార్లమెంటరీ విస్తారక్ సమావేశాన్ని బుధ, గురువారాలలో హైదరాబాద్లో నిర్వహిస్తోంది. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి, కర్నాటక,...
రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆయన జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఆయన యాత్రకు కాంగ్రెస్ నేతలు, ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చడంతో బీజేపీ నేతలు పైర్ అవుతున్నారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా సల్మాన్ ఖుర్షీద్ వ్యవహరించాల...
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సీన్ను అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తమ ఇన్ట్రాన్సల్ కోవిడ్ 19 వ్యాక్సీన్ ఇన్కోవాక్(iNCOVACC) డోస్ ధరను రూ.800గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. అయితే ఇది ప్రయివేటు మార్కెట్ ధర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డోస్ ధర రూ.325గా పేర్కొంది. దీనిపై 5 శాతం జీఎస్టీ ఉంటే కనుక డ...
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ తో పాటు.. వారి కుటుంబ సభ్యులు పలువురు గాయాలపాలయ్యారు. బాందీపురా నుంచి మైసూర్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ మోడీ కుటుంబీకులు ప్రయాణిస్తున్న సెడాన్ ఒక డివైడర్ను ఢీకొంది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. కడకోల ప్రాంతం వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్ల...
భారత్ జీ20 సదస్సుకు హోస్ట్గా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్ తన శాంతి ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ సందర్భంగా సూచించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జీ20 సదస్సు జరగనుంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, జెలెన్స్కీ… మోడీతో ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా మ...
చైనాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇక్కడ రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. షాంఘైకి సమీపంలోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రావిన్స్ జెజియాంగ్ నగరంలోనే ప్రతిరోజు పది లక్షల కేసుల వరకు వెలుగు చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయని ఆదివారం నాడు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, చైనాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో మూ...
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఆయన పైన ఉన్న అవినీతి కేసులో దర్యాఫ్తును తిరిగి ప్రారంభించింది. యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఇందుకు సంబంధించి 2018లో సీబీఐ విచారణను ప్రారంభించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ఆర్జేడీ జత కట్టిన కొద్ది నెలలకు ఈ విచారణ తిరి...
రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన యాత్ర దేశ రాజధాని ఢిల్లీలో సాగుతోంది. కాగా… రాహుల్ జోడో యాత్రకు కమల్ హాసన్ సంఘీభావం తెలిపారు. రాహుల్ గాంధీ తో కలిసి కమల్ హాసన్ కూడా ఈ జోడో యాత్రలో నడవడం విశేషం. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైన యాత్ర సాయంత్రం 4.30 గంటలకు ఎర్రకోట వద్ద ముగిసింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కమల్ […]
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న వాహనికి ప్రమాదం జరిగింది. కారు ఇడుక్కి జిల్లాలోని కుమలి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో చిన్నారి సహా మొత్తం 10 మంది ఉన్న...