అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. [&hel...
హిమాచల్ ప్రదేశ్లో ట్రెండ్ను మారుస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించినప్పటికీ, ఆ ఆశలు నెరవేరలేదు. గుజరాత్ను ఏడోసారి సునాయాసంగా దక్కించుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత వెనుకబడింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్దే పైచేయి. 1985 నుండి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మారుతోంది. ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసార...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార, ప్రతిపక్ష స్థానానికి ఎగబాకే పరిస్థితులు కనిపించనప్పటికీ, పార్టీ ట్యాగ్ విషయంలో ఊరట దక్కే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం గుజరాత్లో బీజేపీ 150 సీట్ల వరకు, కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దక్కించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని వ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్నా అది రెండు మూడు స్థానాల తేడాతోనే ఉండే అవకాశముంది. కానీ గుజరాత్లో మాత్రం బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. పోస్ట్ పోల్ సర్వే ఫల...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేడు (గురువారం, డిసెంబర్ 8) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఇప్పటికే అక్కడ బీజేపీ ఆరుసార్లు అధికారంలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయ...
ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఇటీవల పోలింగ్ జరగగా.. నేడు.. ఆ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాగా… ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించింది. ఆప్కి చెందిన 131 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. అదే సమయంలో బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ...
అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ...
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలను నేడు (బుధవారం, డిసెంబర్ ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించనున్నారు. ఈ ప్రకటనకు ముందు మా...
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటి వద్ద ప్రశ్నించనున్నట్లు తెలిపింది. కవిత విచారణ అంశం ఉదయం నుండి సస్పెన్స్గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కవిత ఇంటి వద్ద సీబీఐ కోసం వేచి చూశారు. మరోవైపు […]
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, బుధవారం ఆర్బీఐ రెపో రేటు సహా ఇతర నిర్ణయాలు, వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాస సమీక్ష సమావేశం(MPC) సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు MPC అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెపో రేటును వరుసగా పెంచుకుంటూ రావడంతో ఇప్పటికే 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈసారి కాస్త తగ్గించి 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అం...