మీకు నూడుల్స్ ఇష్టమా? అదీ వీధి బండ్లలోపై దొరికే ఫుడ్ ఇష్టంగా తింటారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. నూడుల్స్ ఎలా తయారు చేస్తారనే వీడియోనే పీఎఫ్సీ క్లబ్ ఫౌండర్ చిరాగ్ భట్టాచార్య ట్విట్టర్లో షేర్ చేశారు. 59 సెకన్ల నిడివి గల వీడియోలో నూడుల్స్ తయారీని చూపించారు. పరిశుభ్రతను మాత్రం మరిచారు. ఓ సారి వీడియో చూస్తే.. మరోసారి స్ట్రీట్ సైడ్ నూడుల్స్ తినే ధైర్యం చేయరు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని గుర్తు చేశారు. ఆ తత్వవేత్త మాదిరి ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. 19న జమ్మూ కాశ్మీర్లోని లఖన్పూర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్ను ఏ...
వందేభారత్ రైళ్లపై దాడులు కలకలం రేపుతోన్నాయి. పశ్చిమ బెంగాల్, విశాఖపట్టణంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్లో గల కతిహార్ జిల్లాలో ఈరోజు దాడి జరిగింది. 22302 నంబర్ రైలుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. సీ6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య గ...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్లోకి అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ని హైకోర్టు సస్పెండ్ చేయగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని ...
మూఢనమ్మకాల చాటున మానవులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అతీత శక్తులు ఉన్నాయంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర సంఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళకు ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులు అస్థికలు తినిపించారు. క్షుద్ర పూజలు నానా బీభత్సం సృష్టించారు. ఆ బాధలకు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్రలోని సింహగడ్ పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలోని ధైరీ ప్రాంతంలో నివసిస్త...
బీజేపీ సీనియర్ నేత పురుందేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారా..? ఇది పుకారు కాదు… స్వయంగా… పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు చెప్పడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు చెప్పారు. దానిలో భాగంగానే.. ఓ సందర్భంలో పురందేశ్వ...
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కశ్మీర్ కి చేరుకుంది. పంజాబ్లోని పఠాన్కోట్ మీదుగా రాహుల్ గాంధీ జమ్మూలోకి ప్రవేశించారు. కాగా, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో రాహుల్ గాంధీకి ఆ రాష్ట్రనేత ఫరూక్ అబ్ధుల్లా స్వాగతం పలికారు. ఈనెల 30 వరకు జమ్మూకాశ్మీర్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనున్నది. ఈనెల 30వ తేదీన శ్రీనగర్లో జరిగే పాదయాత్ర, భారీ బహిరంగ సభతో భారత్ జోడో యాత్ర ముగుస్త...
మునుపెన్నడూ సాధ్యం కాని రీతిలో బీజేపీ గుజరాత్ లో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే సాధ్యమైంది. గతంలో కన్నా అత్యధికంగా 156 అసెంబ్లీ సీట్లు గెలవడానికి కారణం మోదీనే. దీనికి గుర్తుగా ఓ స్వర్ణకారుడు మోడీ విగ్రహాన్ని 156 గ్రాముల బంగారంతో తయారుచేశాడు. మోదీపై అభిమానంతోనే బంగారు విగ్రహం తయారు చేశానని గుజరాత్ కు చెందిన స్వర్ణకారుడు తెలిపాడు. స్వర్ణమయమైన మోడీ విగ్రహ...
మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు పై మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. డీజీసీఏ నిబంధనల మేరకు ఎయిరిండియా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఘటనకు వేదికైన న్యూయార్క్-ఢిల్లీ విమానం పైలెట్ ఇంఛార్జి లైసెన్స...
నాలుగు నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూలుక్ తో కనిపించారు. తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరిగి.. ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్మూలోని కతువాలో రాహుల్ జాకెట్ ధరించి కనిపించారు. చలిగా ఎక్కువగా ఉన్నా సరే కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకొని జోడో యాత్రను కొనసాగించారు. జ...
జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్...
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్దులకు అప్పాయింట్మెంట్ లెటర్లను ప్రధాని మోదీ వీడియో కాన్షరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు ,లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు,కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్మెంట్ ఈ పథకం ద్వారా చేస్తారు. అందుకు సంబంధించినకు నియామక పత్రాలను పంపిణీ చేసి ప్రధాని రోజ్ గార్...
పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. పట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది ...