»Before The G20 Meeting Spain President Tested Covid Positive Not Attending G20 Delhi Summit
G20 summit:కు ముందే దేశాక్షుడికి కరోనా పాజిటివ్
భారత్లో జరగనున్న G20 సమ్మిట్కు తాను రాలేనని స్పెయిన్ అధ్యక్షుడు Pedro Sánchez చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్(Pedro Sánchez) ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను ఈ సదస్సుకు హాజరు కాలేనని ప్రకటించారు. గురువారం కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానే బాగానే ఉన్నానని, కానీ రాలేనని తెలిపారు. అయితే తనకు బదులుగా స్పెయిన్ వైస్ ప్రెసిడెంట్ నాడియా కాల్వినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20.
Me encuentro bien.
España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación.
మరోవైపు ఇప్పటికే రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్, చైనా(china)కు చెందిన జి జిన్పింగ్లు ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది. యూరోపియన్ యూనియన్ నుంచి 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు. ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లలిత్ మోడీ ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స తీసుకుంటున్నారు. వారంలో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఇన్ స్టా గ్రామ్ ద్వారా చెప్పారు. కొవిడ్, ఇన్ […]