లాభాలబాటలో శ్రీవిద్యానికేతన జెండా ఎగరేస్తోందనే చెప్పాలి. కానీ ఆ నిధులన్నిటిటీ మంచు విష్ణు దుర్వినియోగం చేసి, సినిమా నిర్మాణాలకి ఉపయోగించి, నీతినియమం లేకుండా బలాదూర్గా తయారయ్యాడనే ఆవేదనతోనే మంచు మనోజ్ తిరగబడ్డాడనే అధికారికంగా అందరూ అనుకున్న భోగట్టా
హిట్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంచు మనోజ్ ఒక సంచలనాత్మకమైన విషయాన్ని వివరించాడు. మోహన్బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్, యూనివర్సిటీ అయిన తర్వాత దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఆకాశమంత ఎత్తుకి ఎదిగింది. ఆర్ధికలావాదేవీలు కూడా బాగా ఊపందుకున్నాయి. లాభాలబాటలో శ్రీవిద్యానికేతన జెండా ఎగరేస్తోందనే చెప్పాలి. కానీ ఆ నిధులన్నిటిటీ మంచు విష్ణు దుర్వినియోగం చేసి, సినిమా నిర్మాణాలకి ఉపయోగించి, నీతినియమం లేకుండా బలాదూర్గా తయారయ్యాడనే ఆవేదనతోనే మంచు మనోజ్ తిరగబడ్డాడనే అధికారికంగా అందరూ అనుకున్న భోగట్టా.
కానీ, మంచు విష్ణు మాత్రం తాను నీతివంతుడననినే బలమైన వాదనతో మంచు మనోజ్ మీద తెగబడి కలియబడ్డాడని కూడా పరిశ్రమలో చాలా బహిరంగంగానే మాట్లాడారు. ఆ విషయాన్నే మంచు మనోజ్ హిట్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేయడం విశేషం. .ఆఫ్కోర్స్….గతంలో కూడా మనోజ్ టీవీల ముందుకొచ్చి మాట్లాడాడు అనుకోండి. కానీ ఇందులో మాత్రం మరింత క్లారిటీతో నిలకడగా నిక్కచ్చిగా చెప్పాడు.
విద్యానికేతన్ నుంచి వచ్చిన డబ్బుని దుబాయ్కి మళ్ళించాడని, తన తండ్రి మోహన్బాబు ఒక విజన్తో విద్యాసంస్థని ప్రారంభిస్తే విష్ణు మాత్రం తన స్వప్రయోజనాల కోసం స్వార్ధంతో వాడుకున్నాడని మనోజ్ చాలా గట్టిగానే చెప్పుకొచ్చాడు. ఒక టైంలో తాను చేయాలనుకున్న చిత్రాలను కూడా అన్న మీద అభిమానంతో విష్ణుకే అప్పగించానని కొత్త విషయం ఆవిష్కరించాడు. తన సినిమాలన్నీ బైట నిర్మాతలు నిర్మించినవే గానీ, నాన్న డబ్బుని, హోదాని, పలుకుబడిని తానెన్నడూ వాడుకోలేదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు.
విష్ణుతో వచ్చిన ప్రతీ గొడవకీ కారణం విష్ణు విద్యానికేతన్ నిధులను దుర్వినియోగం చేయడమేనని మనోజ్ పదేపదే చెప్పాడు. ప్రస్తుతం మనోజ్ నటించిన భైరవం సినిమా మే 30న విడుదల కానుండగా, మిరాయ్ కూడా విడుదలకు సన్నద్ధమవుతోంది. హీరోగా మరో రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయని మనోజ్ హిట్ టీవికి వివరించాడు.