AP: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 11న రాత్రి 8 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ.500గా నిర్ణయించింది. అలాగే, జనవరి 12 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్లో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 120 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.