SKLM: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తి గౌరవం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోందని జాతీయ కమిటీ సభ్యుడు ఎన్. ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీవో హోమ్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా పోరాటం చేస్తామన్నారు.