CTR: శాంతిపురం మండల పరిధి పెద్దూరు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పీఈఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీఆర్వోలు వెంకటేష్, చంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.