NDL: రైలు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీశ్ అనే యువకుడు సోమవారం బొమ్మల సత్రం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
VZM: ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో జరిగే అనర్థాలపై పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గతనెల 30న జిల్లా పర్యటనకు వచ్చిన గంజాయి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఇందుకోసం ‘ఈగల్ సెల్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 26 జిల్లాల్లోనూ ఈగల్ కంట్రోల్ సెల్స్ రానున్నాయి.
MDK: పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగి గ్రామానికి చెందిన బోడ రాజు కుమార్తె అకిల(16) విద్యార్థినిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కాళ్లు నుజ్జునుజ్జు కాగా మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అని అన్నారు.
SRPT: నాగారం మండలం ఈటూరు ఆవాసం ప్రగతి నగర్లో విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంట గీత (50) తన ఇంటి ఆవరణలో ఉన్న పశువుల కొట్టంలో వైర్ ఫెయిల్ అయి ఒక్కసారే షార్ట్ సర్క్యూట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో పరువుహత్య సంచలనం సృష్టించింది. హయత్ నగర్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న నాగమణి పది నెలల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి నెల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తన తమ్ముడు నాగమణి విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో డాడి చేసి హతమార్చాడు.
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో పరువు హత్య సంచలనం సృష్టించింది. హయత్ నగర్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న నాగమణి పది నెలల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి నెల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తన తమ్ముడు నాగమణి విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో డాడి చేసి హతమార్చాడు.
RR: ఇబ్రహీంపట్నం పరిధి రాయపోల్-ఏన్లగూడ రోడ్లో మహిళా కానిస్టేబుల్ హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి నెలరోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం డ్యూటీకి స్కూటీపై వెళ్తుండగా ఆమె తమ్ముడు కారుతో ఢీకొట్టాడు. కిందపడిన ఆమెను కత్తితో మెడపై నరికి హత్య చేశాడు.
VSP: సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ (24)ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 10th ఫెయిలైన అతను ఈవెంట్స్ సంస్థను నెలకొల్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన వ్యాపారాల్లో సెలబ్రెటీలు పెట్టుబడులు పెడుతున్నారని నమ్మించి పలువురి వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాడు.
WGL: జిల్లా నెక్కొండ మండలంలోని రామన్న కుంట తండ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రామన్నకుంట తండా గ్రామానికి చెందిన గుగులోతు భాస్కర్ కుమారుడు విక్కీ (6)కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
NRPT: కృష్ణ మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయం ఒకరు మృతిచెందారు. మృతుడు MBNR జిల్లా హన్వాడ మం. టంకరకు చెందిన కఠికే సురేష్గా గుర్తించారు. సురేశ్ చికెన్ సెంటర్ వ్యాపారి. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి చనిపోయారు. యాదగిరిగుట్ట డిపో బస్సు రాయచూర్ నుంచి HYDకి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
W.G: కొవ్వూరు మండలం దొమ్మేరులో ఓ వ్యక్తిపై ఆదివారం బీరు సీసాతో దాడిచేసిన ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మారి, ఫణి ఆదివారం మధ్యాహ్నం మహేశ్తో గొడవపడి దుర్భాషలాడారు. అనంతరం అతని ఇంటికి వెళ్లి మహేశ్ను కొట్టి, బీరు సీసాతో గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిప...
ములుగు: వాజేడు ఎస్సై హరీష్ నేడు (సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్లో రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
NZB: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ హార్వెస్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ATP: యాడికి మండలం చందన గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. కాపర్ వైర్లు, ఆయిల్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకోవడం కోసం సీఐ వీరన్న ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
TG: హైదరాబాద్, మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ కలకలంరేగింది. ఓయోలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడు. పార్టీలో ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ను పట్టుకున్నారు.