KMR: బిచ్కుంద మండలం గోపన్నపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం శాంతాపూర్ నుండి నీలగిరి కట్టెలను హస్టుల్కు చెందిన ఈర్వంత్ అనే రైతు,తన చేనులో గుడిసె వేయడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా గోపనపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్లో ఉన్నరైతు ఈర్వంత్ కట్టెల కింద పడి మృతి చెందాడు.
NZB: ఆర్మూర్ పట్టణం సుభాష్ నగర్ వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు కోడిగుడ్ల లోడ్తో వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ ఢీ కొన్నాయి. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఆర్మూర్ వద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. టాటా ఏసీ వ్యాన్ డ్రైవర్ ని ఆంబులెన్స్లో నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బల్లికురవ మండలంలోని వేమవరం వాగు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ భాష తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం గ్రామం వద్ద వీరిది చక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న SK. ఖాన్సా అనే మూడు నెలల పాప అక్కడికక్కడే మరణించింది.
SRPT: అనంతగిరి మండలం శాంతినగర్లోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈతకు దిగగా ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి బిహార్లోని చంపారన్కు రోగిని తరలిస్తుండగా.. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్సు ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అనిష్ షా(18) అనే రోగిని తమ స్వగ్రామానికి త...
JN: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పల మండలం బోడబండ తండాలో ఆదివారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు భూక్య మల్లేష్ అతని భార్య భూక్య బుజ్జి లు కలిసి గుడుంబా కాస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. దాడుల్లో 4 లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సృజన్ కుమార్ తెలిపారు.
బిహార్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లా సారెంజాపూర్ గ్రామంలో మట్టి పెళ్లలు కూలి నలుగురు బాలికలు ప్రాణాలు విడిచారు. ఇంటి కోసం మట్టి తవ్వుతుండగా ఆరుగురు బాలికలపై పెళ్లలు పడ్డాయి. వెంటనే పెళ్లలను తవ్వి బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు శివాని, సంజ్, నైన్తారా, సరితగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్...
SKLM: కొత్తూరు మండలం కాశీపురంలో ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. అరసవిల్లి నుంచి ముగ్గురు కారులో వస్తుండగా మెట్టూరు సమీపంలో వాహనం అదుపుతప్పి పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ELR: ఆర్ఆర్ పేట పరిధిలో నివాసం ఉంటున్న ప్రియాంక (25) అనే వివాహిత ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త వేధింపులు, అనుమానంతో ఉరి వేసుకుని మృతి చెందిందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ మోతిలాల్(38)కు ఇద్దరు భార్యలు ఉండడంతో కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మనస్థాపానికి గురైన మోతిలాల్ పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
PLD: రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గాయపడిన ఘటన పిడుగురాళ్ల పట్టణ శివారులోని కొండమోడు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పిడుగురాళ్ల పురపాలక సంఘ పరిధిలోని లెనిన్ నగర్ కాలనీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న చిన్నాను లారీ ఢీకొంది. ఈ ఘటనలో చిన్నా తీవ్ర గాయాలపాలయ్యాడు.
MDK: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్ (24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు.
TPT: వాకాడు మండలం వాళ్లమేడు గ్రామానికి చెందిన బండి శేషయ్య(73) అనే వ్యక్తి చలిగాలులకు మృతి చెందారు. చలిగాలులకు తీవ్ర ఇబ్బంది పడిన శేషయ్యను ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా జీవచ్ఛవంలాగా పడిఉండడంతో స్థానిక వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారని మృతుని బంధువులు తెలిపారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల విద్యార్థిని అదృశ్యంపై రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదు అయింది. ఆమె రాజమండ్రిలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని వసతి గృహ సంక్షేమ అధికారిణి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రిలో కేసు నమోదు చేశారు.
TPT: శ్రీకాళహస్తి మండలం ఓటుగుంట ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి యువకుడు రవిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, రవిని వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రవి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన స్వస్థలం వెంకటాపురం కాగా ఏడేళ్లుగా ఓటుగుంట ఎస్టీ కాలనీలో ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.