యూపీలోని కాన్పూర్లో ఇజ్రాయెల్ యంత్రంతో ఆక్సిజన్ థెరఫీ చేసి 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్ల యువకులుగా మారుస్తామని రాజీవ్ దూబే, రష్మీ దూబే ప్రజలను నమ్మించారు. సాకేత్ నగర్లో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. కొంతమందికి థెరపీ కూడా చేశారు. కానీ, చికిత్స కారణంగా ఎవరూ లాభపడకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ థెరపీ కోసం ప్రజల నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్...
NZB: బోధన్ సాలుర మండల హన్సా గ్రామానికి చెందిన సంజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై బోధన్ వెళుతుండగా సోమవారం ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి NH 63కి అనుసంధాన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో సాలూర వద్ద మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో సంజూ అక్కడికక్కడే మృతి చెందారు.
రాంచీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మహిళ భర్త సునిల్ బార్లా తెలిపాడు. ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడి చేశాయని, వారు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నాడు.
AP: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 10 మంది వద్ద దాదాపు రూ.కోటి వసూలు చేసిన మోసానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపి, దొంగ అధికారులతో విచారణ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్...
ఇరాన్ తబాస్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 38 మంది మరణించగా.. 14 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మీథేన్ వాయువు అకస్మాత్తుగా లీక్ కావడం వల్ల పేలుడు జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, మృతదేహాలపై ఎలాంటి బ్లాస్ట్ గాయాలు లేవని, వాళ్లు పేలుడుకు ముందే వాయువు వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ATP: అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ATP: అనంతపురంలోని నేషనల్ పార్క్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడు లారీ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ వైపు వెళ్తున్న RTC బస్సు వెనక చక్రాల కింద పడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
KMM: కుటుంబ కలహాలతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. బాణాపురం గ్రామానికి చెందిన బాణాల శ్రీనివాస్ (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. కొండన్న పల్లి స్టేజి వద్ద కారును వెనక నుంచి బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు వెనుక భాగం ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ELR: దేవరపల్లి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. ఏలూరు వైపు నుంచి కొవ్వూరుకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
VZM: సోమవారం తెల్లవారుజామున నాతవలస టోల్ ప్లాజా వద్ద విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లే హైవే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మరణించినట్లు డెంకాడ ఎస్ఐ ఏ.సన్యాడినాయుడు సోమవారం తెలిపారు.మృతుడు హైవే రోడ్డు సర్వీసు రోడ్డులో నిద్రిస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేసును హిట్ అండ్ రన్ గా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
జనగాం: పాలకుర్తి మండలం ధర్ధపెల్లి వాగులో సోమవారం తెల్లవారుజామున ఓ కారు పడిపోయిన ఘటనలో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పాలకుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
NLR: కావలి మండలం పెద్దవరం- ఆర్ సి పాలెం మార్గంలోని అడవిలో కోడిపందెం స్థావరంపై ఆదివారం రూరల్ సీఐ జి. రాజేశ్వరరావు, ఎస్సై బాజీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. నిందితుల నుంచి రూ. 15, 400 నగదు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
VZM: మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిలో బొబ్బిలికి చెందిన కె.సౌమ్య ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.