కోర్టులో విచారణ సందర్భంగా లేబర్ కోర్టు జడ్జికి ఓ వ్యక్తి రూ.35 వేల లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. జడ్జికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన బాపు సోలంకి అనే వ్యక్తిని గుజరాత్ అవినీతి నిరోధక బ్యూరో అరెస్టు చేసింది. సోలంకి కోర్టు గదిలోకి వెళ్లి జడ్జి టేబుల్పై మూసివున్న కవరు ఉంచాడు. దాన్ని తెరవమని న్యాయమూర్తి తన సిబ్బందిని కోరగా.. కవరు లోపల రూ.35,000 కనిపించినట్లు అధికారులకు తెలిపారు.
KRNL: ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రాజాం పట్టణంలోని హీరో బైక్ షో రూమ్ వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు మేరకు ఓ ప్యాసింజర్ ఆటో వేగంగా వచ్చి రోడ్డును దాటుతున్న సుమారు 60 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తలపై తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదు.
వరంగల్: నర్సంపేట ప్రధాన రహదారి లేబర్ కాలనీ అపోలో ఫార్మసి వద్ద ఆదివారం రోడ్డు దాటుతున్న ఇద్దరు దంపతులను ఆటో ఢీకొట్టింది. దంపతులను ఆస్పత్రికి తరలించగా లేబర్ కాలనీకి చెందిన ల్యాదేళ్ల సంపూర్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ కోరింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.
NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి 10గం.ల సమయంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
NZB: వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన. పెర్కిట్కు చెందిన శ్రీరాం అశోక్ ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్ పై వెళ్తుండగా నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
KDP: కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్కు రిమాండ్ విధించారు. నిఖేష్ కు ఈనెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో నిఖేష్ను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు.
ELR: పోలవరం మండలం గుంజవరంకి చెందిన రాంబాబు (46) మృతిపై అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాంబాబు నవంబర్ 28న పురుగుమందు సేవించడం జరిగిందని, రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. రాంబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుమారుడు రవీంద్ర శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
TPT: చంద్రగిరి మండలం కొత్తఇళ్లు గ్రామంలో భారీ దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన సిద్ధులు నాయుడు కుటుంబం శనివారం ఇంటికి తాళాలు వేసి తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోని రూ.6 లక్షలు నగదు, సుమారు 200 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు.
PLD: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెట్లూరివారిపాలెం నుంచి కోటప్పకొండ వైపు బైక్పై వస్తున్న బాలుడు ఓ మలుపు వద్ద ప్రమాదవశాత్తు లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన బాలుడు పెట్లూరివారిపాలెం చెందిన రామారావు కుమారుడు కమల్(14)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
KRNL: తెలంగాణ షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ఇద్దరు మృతి చెందారు. రెడ్డిపాలెంలో పత్తి తీసేందుకు కర్నూలు నుంచి వలస కూలీలు శుక్రవారం రాత్రి ట్రైన్లో తిమ్మాపూర్కు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఓ ట్రాక్టర్లో వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సోమమ్మ(55), మమత(5) అక్కడికక్కడే మృతిచెందారు.
TG: బిజినెస్ పేర మోసాలకు పాల్పుడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన కాంతిదత్ జూబ్లీహిల్స్లో సస్టెయిన్ కార్ట్ పేరుతో స్టోర్ ప్రారంభించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. తరువాత తృతీయ పేరుతో జ్యూలరీ షాప్ ప్రారంభించి పరిణితి చోప్రాతో ప్రాచారం చేశాడు. పరిణితికి ఇవ్వాలంటూ శ్రీజా రెడ్డి అనే మహిళను నమ్మించి రూ.1.5కోట్లు తీసుకున్నాడు. అలాగే నకిలీ పత్రాలతో ఎస్బీఐలో దాదాపు ...
W.G: బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.