VZM: భోగాపురం మండలం కొండ రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. దానయ్య గల్లంతుకావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దానయ్య రామచంద్రపేట హైస్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు.
VSP: భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం కురపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు రిసార్ట్లో స్విమ్మింగ్ ఫుల్లో మృతదేహం కలకలం రేపింది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుల పుట్టిన రోజు వేడుకలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మద్యం తాగి స్విమ్మింగ్ ఫుల్ దిగి అభిషేక్ వంశీ (24)మృతి చెందినట్టు ప్రాథమిక నిర్థారణకు పోలీసులు వ&zwn...
SKLM: సరుబుజ్జిలి మండలం పాటపాడు-పర్వతాల పేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం పూరి ఇల్లులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఎన్.ముఖలింగం కుటుంబానికి చెందిన 2 పూరి ఇల్లులు, సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
VSP: విశాఖపట్నంలోని జైల్ రోడ్డు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ ప్రధాన బ్రాంచ్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దట్టంగా పగలు వ్యాపించడంతో స్థానికులు తగిన మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
AP: ఆస్తికొసం ఓ తల్లి కన్న కొడుకును హత్య చేయించిన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్లో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తల్లి, కొడుకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. దీంతో మహబూబ్ బాషా(28)పై తన తల్లి మున్నీబీ దాడి చేయించింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చేందాడు. ‘తల్లి, కుమారుడి మధ్య ఉన్న ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం.&...
KKD: పెద్దాపురంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాటాకుల ఇల్లు దగ్ధం అయింది. గురువారం పెద్దాపురంలోని వీర్రాజుపేటలో మాడ మల్లికార్జున తాటాకు ఇంటిపై తారాజువ్వ పడి ఇల్లు దగ్ధం అయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా, సుమారు రూ.50,000 ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.
ఏలూరు: తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. దీపావళి బాణసంచా తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి గోతిలో పడింది. ఈ సమయంలో బాణసంచా పేలిపోవడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు 1టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా 5గురు గాయపడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్ హైవేపై వెళ్లున్న టెంపోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న 6గురు మృతి చెందారు. అనంతరం వచ్చిన కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
KKD: సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామానికి చెందిన ఆనాల భూషణం మృతదేహం గురువారం ఉదయం పి. వేమవరం పంట కాలువలో లభ్యమైంది. బుధవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: విజయవాడలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శిరీష అనే మహిళ తన తల్లి వజ్రమ్మను ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు రైల్వేస్టేషన్కు వెళ్లింది. పట్టాలు దాటుతూ.. 3వ ప్లాట్ఫ్లాం వద్ద వజ్రమ్మకు సాయం చేయబోయింది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
KMR: సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తిని గొడ్డలితో తలపైన నరికి దారుణంగా హత్య చేశారని ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఈ వ్యక్తి ఫోటోను ఎవరైనా గుర్తు పడితే తమ సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఎస్సై రంజిత్ కుమార్ సెల్ నెంబర్ :8712686164,8712686163 లను సంప్రదించాలని పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య చేసి ఉంటారన్నారు.
AP: విశాఖ SBI మెయిన్ బ్రాంచ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. SBI శాఖ నిర్వహిస్తున్న భవనం నుంచి పొగలు వచ్చాయి. దీపావళి కారణంగా సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు. లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది బ్యాంక్ డోర్లు పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
NDL: నంద్యాల రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 9441509497 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.
అన్నమయ్య: అతిగా మద్యం తాగి మదనపల్లిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ రామచంద్ర కథనం.. స్థానిక సీటీఎం రోడ్డులోని మీసేవ సమీపంలో రోడ్డు పక్కన అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి క్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ALR: దీపావళి రోజు అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుంచి మద్దిగరువులో జరిగే వారపు సంత వెళ్తుండగా చింతపల్లి ఘాట్ రోడ్డు సమీపంలో బొలోరో.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.