భారతీయ నౌకదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ భారీ డ్రగ్స్ను సీజ్ చేసింది. సుమారుగా 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని పట్టుకుంది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి బయటకు వచ్చిన శ్రీలంక వ్యక్తి సంథాన్ రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ శరీరానికి పొందాలనే ఉద్దేశంతో ఓ పేషెంట్ నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు. కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు.
ముంబాయిలో మరాఠా కోటా ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. జల్నాలోని ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల సమీపంలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా గంగా నదిలో స్నానం చేసేందుకు హరిద్వార్కు వెళుతున్న ప్రయాణికుల ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెరువులో పడిపోయింఇ. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.
ఓ టీవీ ఛానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. యాంకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు.