• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

గాజాలో దాడులు.. 22 మంది మృతి!

గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు. తాజాగా నగరంలోని దక్షిణ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని.. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

September 21, 2024 / 07:10 PM IST

షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలో గల బత్తులనగర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన సోడి వెంకటేష్, గోపి కుటుంబానికి చెందిన ఇల్లు కరెంట్ షాక్తో కాలిపోయింది. సుమారు 1లక్ష రూపాయిల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 21, 2024 / 06:55 PM IST

ఇంటిపై పడ్డ పిడుగు

SRPT: సూర్యాపేటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో బారీ వర్షం కురుసింది. తాళ్లగడ్డ చెందిన లూనావత్ విజయ్ సింగ్ ఇంటి స్లాబ్ పై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 11ఫ్యాన్లు, 3 టీవీలు కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుచుకున్నారు.

September 21, 2024 / 06:49 PM IST

VIDEO: స్కూల్ వ్యాన్ డీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

JGL: వెల్గటూరు మండలం చెర్లపల్లి-దమ్మనపేట చౌరస్తాలో శనివారం ఓ స్కూల్ బస్సు ఎక్సెల్ వాహనం డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పెగడపల్లికి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జగిత్యాలకు తరలించారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 21, 2024 / 06:32 PM IST

వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

CTR: ద్విచక్ర వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు కార్వేటి నగరంలోని మణికండ్రిగ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వాహనం అదుపుతప్పడంతో కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

September 21, 2024 / 05:15 PM IST

పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

SRPT: చిలుకూరు మండలంలోని పాత చిలుకూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి రెండు గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే రైతుకు చెందిన రెండు గేదెలను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మృతిచెందిన గేదెలు విలువ సుమారు 1.50 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

September 21, 2024 / 04:54 PM IST

చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు

అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో చైనాలోని ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్‌ గవర్నర్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, 10 లక్షల యువాన్లు (రూ.1.18 కోట్లు) జరిమానా విధించారు. అయితే, ఆమె అందం కారణంగా అక్కడి జనాలు ఇప్పటికీ ‘అందమైన గవర్నర్’ అని పిలుస్తారు. యాంగ్ 58 మంది మగ సహోద్యోగులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, దాదాపు 60 మిలియన్ యువాన్లు (రూ.71,02,80,719) లంచాలు తీసు...

September 21, 2024 / 04:49 PM IST

హత్య కేసులో ఇరువురి అరెస్ట్

KKD: కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఈనెల 15వ తేదీన జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ త్రీ టౌన్ సీఐ కెవిఎస్ సత్యనారాయణ తెలిపారు. ఆయన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈశ్వరరావు హత్య ఉదాంతాన్ని వివరించారు.

September 21, 2024 / 04:26 PM IST

నూజివీడు పట్టణంలో పట్టపగలే చోరీ

కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో గల సెయింట్ మేరీస్ పాఠశాల సమీపంలో శనివారం పట్టపగలు చోరీ జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఇటుకల వ్యాపారి వల్లభనేని రామకృష్ణ ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగంతకులు చోరీ చేశారు. అగంతకులు 12 కాసుల బంగారం, మూడు కేజీలు వెండి, 45 వేల రూపాయల నగదు చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

September 21, 2024 / 04:20 PM IST

ఇదేంట్రా అయ్యా.. పుష్ప మూవీనే మించేశారుగా

TG: గంజాయి స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏకంగా పుష్ప మూవీనే మించేలా రెచ్చిపోతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా అనంత్‌సాగర్‌ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఓ ట్రాక్టర్ పట్టుబడింది. దీనిని తనిఖీ చేయగా ట్రాలీ కింద స్పెషల్‌గా తయారుచేసిన అరలో 338కిలోల గంజాయిని చూసి పోలీసులు కంగుతిన్నారు. దీనిని ఒడిశా నుంచి కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు తరలిస్త...

September 21, 2024 / 04:06 PM IST

మరోసారి స్పా సెంటర్‌పై దాడి

ఎన్టీఆర్: విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు.

September 21, 2024 / 03:58 PM IST

రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

అన్నమయ్య: సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

September 21, 2024 / 03:14 PM IST

Jani Master Arrest: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని నర్సింగి పోలీసు స్టేషన్‌లో ఒక ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించిన అంశాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, నర్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై జీరో FIR నమోదు చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ చెప్పిన వివరాల్ని పరిగణలోకి తీసుకొని, పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జానీ మాస్టర్ హైదరాబాద...

September 19, 2024 / 12:06 PM IST

హైదరాబాద్ మెట్రో అకౌంట్ హ్యాక్

హైదరాబాద్ మెట్రోరైల్ అధికారిక ట్విట్టర్ (x )ఖాతా మరోసారి హాకింగ్ కి గురైంది. ఇది గత కొన్ని నెలల్లో ఇది రెండో సారి జరుగుతోంది. సైబర్ దొంగలు ట్విట్టర్‌లో నకిలీ సమాచారం పోస్టు చేసి, ఖాతా హాకైనట్లు ప్రకటించారు. ఇది ప్రజలకు ఆందోళన కలిగించింది, ముఖ్యంగా మెట్రో సేవలపై ఆధారపడి ఉన్న ప్రయాణికులకు. Read Also: Game Changer Release date: లీక్ చేసిన తమన్ హాకింగ్ జరిగిన సమాచారం పట్ల హైదరాబాద్ మెట్రో అధికారులు...

September 19, 2024 / 09:17 AM IST

Jani Master Case: బాధితురాలికి అల్లు అర్జున్ అండ?

టాలీవుడ్ పరిశ్రమలో తాజాగా సంచలనం కలిగించిన ఒక ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం, Raidurgam పోలీసు స్టేషన్‌లో ఒక యువతి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు సినిమా చాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ, కొంతమంది సినీ పెద్దలు, చాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ, బాధితురాలికి ఒక ప్రముఖ స్టార్ హీరో మద్దతు అందిస్తున్నారని వెల్లడించారు. ఈ...

September 17, 2024 / 08:02 PM IST