జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా? లేకపోతే CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం అనే దానిపై ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దళిత మహిళను వివాహం చేసుకున్నందుకు భార్యభర్తలను ఇద్దరిని వివస్త్రలను చేసి చెట్టుకు కట్టేసి చావబాదారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్గా మారింది.
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం, లక్కీ కూపన్ పేరిట లింక్స్ సెండ్ చేయడం అమాయకులకు ఆశజూపి లూటీ చేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా ఓ యువతి ఇలానే లింక్ ఓపెన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంది.
ఉత్తరాఖండ్లో మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రస్తుతం హింస ఉద్రిక్తంగా ఉంది. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా దాడి చేసింది. ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై నిన్న వైమానిక దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టోల్గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ సిబ్బందిపై దాడి చేశారు.
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారని కార్యాలయం తెలిపింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ఉండగా.. అందులో పినేరా చనిపోగా మిగతా వాళ్లు గాయాలతో బయటపడ్డారు.
భారత్, రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతనిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరఠ్లో అరెస్టు చేశారు.