KDP: ఎర్రగుంట్ల -ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కిందపడి అరవింద్(21) మృతి చెందినట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, మృతుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.
AP: NTG జిల్లాలో దారుణం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఇంట్లో ఘర్షణ జరిగి ఆవేశానికి గురైన తండ్రి.. ఇనుప రాడ్తో కొట్టడంతో కుమార్తె చనిపోయింది. అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. అయితే, ఆగస్టు 30న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి తండ్రే చంపినట్లు గుర్తించారు. నిందితుడిని ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు.
TG: రాష్ట్రంలో నిన్న పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లా గుమ్మనుయోంగ్లాపూర్లో పిడుగు పడి వెంకటి, ఎల్లయ్య, ఎల్లవ్వ అనే ముగ్గురు మరణించారు. గద్వాల్ జిల్లా భూంపురంలో పిడుగుపడి పార్వతమ్మ, సర్వేశ్, సౌభాగ్యమ్మ అనే మరో ముగ్గురు చనిపోయారు. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలోనూ మహేశ్ అనే రైతు మృతిచెందాడు. కాగా, ఈ దుర్ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి.
మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: సైబర్ నేరగాళ్లు ఏకంగా కాకినాడ ఎంపీ సిబ్బందికే టోకరా వేశారు. వాట్సాప్లో MP డీపీ పెట్టి డబ్బులు వసూలు చేశారు. MP పేరు చెప్పి 11 సార్లు మొత్తం రూ.92 లక్షలు వసూలు చేశారు. ఎంపీ డీపీతో డబ్బులు పంపాలంటూ సీఎఫ్వో శ్రీనివాస్కు మెసేజ్లు పంపారు. ఎంపీ అడిగారని సీఎఫ్వో డబ్బులు పంపారు. ఇటీవల శ్రీనివాస్, ఎంపీ కలుసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది.
NLR: కలువాయి మండలం దాచూరులో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్డివాము దట్టమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాసులకు సుమారు రూ.15 వేలు నష్టపోయినట్లు తెలిపారు. గ్రామంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాటిని సరిచేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
NTR: విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీ సమీపంలో మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 55 మధ్య ఉంటుందని మాచవరం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన యెడల మాచవరం పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
KMR: పిట్లం మండలం ధర్మారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు ప్రకాష్ తండ్రి అంత్యక్రియల కోసం బుధవారం గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా ప్రకాష్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయికనిపించాడు. ప్రకాష్ మరణంపై అనుమానం ఉందని, మృతుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CTR: చౌడేపల్లి నుంచి రాయలపేటకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని సత్వరమే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
PPM: సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం గుర్ల గ్రామానికి చెందిన కుమిలి సంతోష్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్సై సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: కోడూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన చింతా వెంకట్రావు (50) పాముకాటుకు గురై మృతి చెందాడు. బుధవారం చేను గట్టుపై పశువుల కోసం మేత కోస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.చాణక్య తెలిపారు.
ATP: ఉరవకొండ మండలంలో విషాద ఘటన జరిగింది. మైలారంపల్లికి చెందిన 7 నెలల గర్భిణి మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. భర్త హనుమంతు వేధింపులతోనే మౌనిక ఉరేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి మండలం వన్నెదొడ్డిలోని పొలాల్లో కేబుల్ వైర్లు, ఎత్తుకెళ్లే దొంగలను రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. రంగస్వామి, కుళ్లాయప్ప పొలాల్లో కేబుల్ వైర్లను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను రైతులు బుధవారం తెల్లవారుజామున రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి, పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
TG: గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. అయిజ మండలం భూంపురం గ్రామంలో పొలంలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒకరు యువకుడు ఉన్నాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో పొలంలో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపడి అతను చనిపోయాడు.
ATP: గుంతకల్లులోని మేరీ మాత చర్చి వద్ద ఈనెల 8న మారుతి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన మోటర్ బైక్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. మేరీ మాత చర్చి వద్ద పార్కింగ్ చేసి ఉన్న బైకును దుండగులు ఎత్తుకెళ్లారని, పరిసర ప్రాంతాలలో వెతికిన బైకు దొరకకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.