• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

వరదల బీభత్సం.. 95కి చేరిన మృతులు

తూర్పు స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 95కి చేరినట్లు తెలుస్తోంది. అనేక మంది ఆచూకీ తెలియరాలేదు. అలాగే వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2024 / 07:50 AM IST

2033 నాటికి ఏటా లక్ష సైబర్‌ దాడులు

దేశంలో డిజిటల్ వినియోగం పెరగడంతో సైబర్ దాడులు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2033 నాటికి భారత్ ఏటా దాదాపు లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 2047 నాటికి 17 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇటీవల ఎయిమ్స్, ప్రధాన విమానయాన సంస్థల నెట్‌వర్క్‌పై భారీగా సైబర్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

October 31, 2024 / 03:50 AM IST

బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి

MDK: తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చల్మెడ గ్రామానికి చెందిన బొమ్మని కనకరాజు లత దంపతుల కుమార్తె తనుశ్రీ( 7)రెండవ తరగతి చదువుతుంది. గురువారం నాడు సాయంత్రం తీవ్ర జ్వరంతో అస్వస్థకు లోనై ఫిట్స్ రావడంతో మరణించడం జరిగింది.

September 28, 2024 / 03:53 PM IST

సురక్షిత ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్‌!

తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రత కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు.. నస్రల్లా హతం వార్తల వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హెజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

September 28, 2024 / 03:42 PM IST

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

హర్యానాలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోనిపట్ జిల్లాలోని రిదౌ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

September 28, 2024 / 03:34 PM IST

వరదల బీభత్సం.. 39 మంది మృతి

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 39 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా వివిధ నదుల నీటి మట్టాలు పెరుగుతాయని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. పశ్చిమాన ఉన్న నదులకు వరద పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరో 24 గంటలపాటు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని కొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉ...

September 28, 2024 / 03:24 PM IST

ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడు జల్లి బాలయ్య తన ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్లో బస్టాండుకు వస్తున్నాడు. సింగారం గ్రామానికి చెందిన గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తి తన బైకుపై గొల్లపల్లి వెళ్తుండగా బాలయ్య ఢీకొన్నాడు. బాలయ్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.

September 28, 2024 / 03:14 PM IST

‘రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు’

SKLM: బూర్జ మండలం డొంకలపర్త వద్ద ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ఆ ప్రాంతంలో ప్రతి రోజూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గోతులను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

September 28, 2024 / 02:36 PM IST

చౌటుప్పల్‌లో యువకుడు అదృశ్యం

BHNG: బ్యాంకులో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్య మయ్యాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లికి చెందిన ఎండీ సమీర్ చౌటుప్పల్‌లో నగదు డ్రా చేసేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మిత్రులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

September 28, 2024 / 02:29 PM IST

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మేడ్చల్: కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ముళ్ళ కత్వచెరువు నాలా కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని కాలువలో నుంచి కేపీహెచ్బీ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 28, 2024 / 02:27 PM IST

దారుణం: ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. రంగపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి.. తన నలుగురు కూతుళ్లను చంపి ఆత్యహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.&n...

September 28, 2024 / 11:00 AM IST

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్

TG: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య సుమలత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC)లో ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పని కోసం వచ్చి ప్రేమ పేరుతో తన భర్తను వేధింపులకు గురిచేసినట్లు TFCCలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు కక్షతోనే కావాలని జానీ మాస్టర్ పై అక్రమ కేసు పెట్టిందని.. అక్రమ కేసు ఆరోపణలపై చర్య లు తీసుకోవాలని సుమలత విజ్ఞప్తి చేశారు.

September 28, 2024 / 10:35 AM IST

ఉగ్రముప్పు హెచ్చరికలు.. ముంబై హై అలర్ట్‌

కేంద్ర నిఘా సంస్థలు తాజాగా ఉగ్రదాడులపై కీలక హెచ్చరికలు చేశాయి. ముంబై మహానగరంలో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముంబైలో హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలో ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మాక్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

September 28, 2024 / 09:25 AM IST

‘చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు.. కేజీ గంజాయి పట్టివేత’

VZM: ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు గ్రామమైన పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పాచిపెంట ఎస్సై సురేష్ గంజాయి పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ ఒడిస్సా నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఆవల అనిల్, తన స్నేహితుడు భరత్గా గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు.

September 28, 2024 / 08:57 AM IST

బస్సు బోల్తా.. నలుగురు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లాలోని 16వ నెంబర్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 23 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి కొంత మంది భక్తులతో బస్సు.. పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 28, 2024 / 08:47 AM IST