స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ని.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్గా మారింది. అది కూడా హైదరాబాద్లో కావడంతో మరోసారి టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
2018లో ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. బురారీ పేరు వినిపించినప్పుడల్లా 11 మంది వ్యక్తులు పైకప్పు నుండి కొమ్మల మాదిరిగా వేలాడుతూ ఉన్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది.
నగరంలో మందుబాబులపై పోలీసులు నిఘా పెంచారు. డ్రంక్ డ్రైవ్తో పట్టుబడిన వారికి జైలుకు తరలించారు. జూలై నెలలో ఏకంగా1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి మాయమాటలు చెప్పి కోట్లు డబ్బు కొట్టేస్తున్నారు.
హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద హాష్ ఆయిల్, వీడ్ ఆయిల్ విక్రయిస్తున్న డ్రగ్ డీలర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర స్వాధీనం చేసుకున్న సరకు లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత్కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్కుమార్ ఐఏఎస్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేయడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియాలో దుమారం లేపిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంత్ను పోలీసులు అరెస్టు చేశారు. తండ్రీకూతుళ్ల బంధాన్ని లైంగికంగా అర్థం వచ్చేలా చేసిన కామెంట్స్పై తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. దీంతో సైబర్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్గ్రేసియా ప్రకటించారు.