అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడుల కుట్రకు సంబంధించి పాక్ దౌత్యవేత్త ఆమిర్ జుబేర్ సిద్ధిఖీకి NIA కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. హాజరుకాని పక్షంలో సిద్ధిఖీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించి, ఆయన ఆస్తులను జప్తు చేస్తామని NIA హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం సిద్దిఖీ పాకిస్థాన్లో ఉన్నారు.